June 25, 2013
వరద బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయా : చంద్రబాబు
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల
పరిస్థితిని చూసి చలించిపోయానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన
వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సహాయక కార్యక్రమాలు
ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు తమ వంతు సాయం చేస్తున్నామని బాబు తెలిపారు.
తెలుగు ప్రజాలను రాష్ట్రానికి సురక్షితంగా పంపిస్తామన్నారు.
బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఉత్తారాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రికుల కోసం వేరే రాష్ట్రాల
ముఖ్యమంత్రులు సహాయ సహకారాలు ముమ్మరం చేస్తుంటే, మన సీఎంకు మాత్రం ఏదీ
పట్టడం లేదని ధ్వజమెత్తారు. తనపై ఆరోపణలు చేసే బదులు తెలుగు ప్రజలను
రాష్ట్రానికి తరలించేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.
Posted by
arjun
at
7:33 AM