ఏపీ భవన్లో వరద బాధితులను పరామర్శిస్తున్నట్టు సీఎం కిరణ్
నటిస్తున్నారని టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఢిల్లీలో ఆయన
మూడు రోజులుగా సోనియా అనుమతి కోసం ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలుగువారి పట్ల కేంద్రానికి ఎంత చిన్న చూపు ఉందో, సీఎంకు కూడా అంతే ఉండడం
విచారకరమని ఆయన చెప్పారు.