April 21, 2013

తెలుగుదేశం పార్టీకే ముసింల మద్దతు

కొయ్యూరు/మాకవరపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా వున్న ముస్లిం మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అహ్మద్‌షరీఫ్ తెలిపారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును  మాకవరపాలెం మండలం తామరంలో షరీఫ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోగల ముస్లిం మేధావి వర్గంతోపాటు ఉద్యోగులు, వ్యాపారాలు చంద్రబాబు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలుపుతూ బాబు ఆశయ సాధనకు కృషి చేయాలని నిశ్చయించుకున్నామన్నారు. మైనారిటీల అభిప్రాయాన్ని చంద్రబా
బుకు తెలపడానికి ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలకు ఆయనకు పరిచయం చేశానని చెప్పారు.

షరీఫ్‌తోపాటు విజయవాడ నగర టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు చోటా కిల్లాతోపాటు వివిధ ముస్లిం సంఘాలకు చెందిన మరో పది మంది చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారు.