April 21, 2013
బాబుకు బాసటగా..
విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర ఉత్సాహంగా
జరిగింది. చంద్రబాబుమాకవరపాలెం మండలం తామరం నుంచి పాదయాత్ర
ప్రారంభించి రాచపల్లి, రామన్నపాలెం, భీమబోయినపాలెం, దుంగలవానిపాలెం,
శెట్టిపాలెం, రాజుపేట గ్రామాల మీదుగా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో గల
కశింకోట మండలం పాతకన్నూరుపాలెం గ్రామానికి చేరుకున్నారు.తామరంలో బసచేసిన చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ
పరిస్థితిపై చర్చించారు.
అనంతరం భీమిలి నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ మాఫియాతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు ఖనిజ సంపదను, ప్రజల ఆస్తులను దోచుకుంటున్న వైనాన్ని తూర్పారబట్టారు. పాదయాత్ర ప్రారంభించి శుక్రవారం నాటికి 200 రోజులు పూర్తికావడంతో తామరం, భీమబోయినపాలెం గ్రామాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్లను కట్ చేసి అభినందనలు అందుకున్నారు. (నర్సీపట్నం)
Posted by
arjun
at
7:03 AM