April 21, 2013

జనంతో మమేకమై..

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర  నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోనే కొనసాగింది. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెంలో బుధవారం రాత్రి బస చేసిన ఆయన గురువారమంతా బిజీబిజీగా గడిపారు. ఉదయం పాడేరు, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష జరిపి తాత్కాలికంగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే నియోజకవర్గ కన్వీనర్‌లను నియమిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు సుమారు 300మంది బాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. వారికి రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభించి చంద్రయ్యపాలెం, గంగవరం, దాలింపేట, కొండలఅగ్రహారం, మాకవరపాలెం మీదుగా తామరం గ్రామం వరకు అశేష ప్రజాదరణ మధ్య సాగింది. దారిపొడుగునా ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.