April 21, 2013

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

పర్చూరు రూరల్
: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 64వ జన్మదినోత్సవ వేడుకలు పర్చూరు లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 64 కేజీల భారీ కేక్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజల కోసం 64 ఏళ్ల వయస్సు లోనూ పాదయాత్ర చేస్తున్న చంద్రన్న కు ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా కార్య దర్శులు చిట్టినేని రామకృష్ణ, అప్పాజీ, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్, మానం హరిబాబు, పట్టణశాఖ అధ్య క్షులు కృష్ణ, కె.శేషగిరి, డి.బుజ్జిబాబు, పాలేరు శ్రీను, ఎంవీ కిషోర్, థమన్ శ్రీను, ఆర్.పున్నయ్య, ఇజ్రాయేల్, ఇం టూరి శ్రీధర్, అప్పారావు, కె.శ్రీనివాస రావు, కొండ్ర గంటి శివ, దరియాహు స్సేన్, శిరిగిరి నాగేశ్వరరావు, పొన్నం శివ, మక్కెన శేఖర్, వెంకటేశ్వర్లు, హైటెక్ సుభానీ, తొండెపు ఆదినారా యణ, పోపూరి శ్రీనివాసరావు తదిత రులు పాల్గొన్నారు.

రమేష్‌ను అన్నివిధాల ఆదుకుంటా కారంచేడు : ఆటో ప్రమాదంలో తలకి బలమైన గాయమైంది, దీనివల్ల నరాలు చచ్చుబడి ఎడమ కన్ను పూర్తి గా కనబడుటలేదు. కుడి కన్ను పగటి పూట కొంతమేర మాత్రమే కనబడు తుంది. ఆర్థిక స్థోమత లేని వాడినని స్వర్ణ గ్రామానికి చెందిన పోలకం రమే ష్ శనివారం గ్రామానికి వచ్చిన నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబ శివరావుకు తన బాధను విన్నవించుకు న్నాడు.

వెంటనే స్పందించిన ఏలూరి సాంబశివరావు శంకర్ నేత్రాలయ వైద్యులతో ఫోన్‌లో రమేష్ పరిస్థితి మొత్తం వివరించారు. మంగళవారం రమేష్‌ను నేత్రాలయంకు వెళ్లమని చెప్పారు. రమేష్ వైద్యానికి అయ్యే ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఏలూరి వెంట గ్రామ టీడీపీ నాయకులు మాలెంపాటి సత్యనారా యణ, తిరుమలశెట్టి శ్రీహరి, లక్కాకు ల శ్రీనివాసరావు, సుధా నాగేశ్వరరా వులు ఉన్నారు.

యద్దనపూడి : చంద్రబాబు జన్మ దినం సందర్భంగా యద్దనపూడిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శని వారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు ప్రత్యేక పూజ లు చేశారు. ఈ నెల 27న విశాఖ పట్ట ణంలో పాదయాత్ర ముగింపు సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా అభి మానులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపనేని రంగయ్యచౌదరి, ఆదినారా యణ, శ్రీను, కోటేశ్వరరావు, సీతయ్య, కామేశ్వరరావు, సాధినేని సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంకొల్లు రూరల్ : చంద్రబాబు 64వ జన్మది నోత్సవం సందర్భంగా ఇంకొల్లులోని జామియా మసీదులో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మిఠాయిలు పం పిణీ చేశారు. ఇరువురు వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తొం డెపు ఆదినారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి నాయుడమ్మ, అన్సారీ, మాబాషా, మాబుల్లా, రఫీ, వై.ప్రసాద్ రెడ్డి, బోడావుల శేషగిరిరావు, రావి రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.