April 21, 2013

ఓబులాపురం అక్రమాలపై టీడీపీ ఆనాడే చెప్పింది

లక్కవరపుకోట : ఓబుళాపురం గనుల్లో అనేక వే ల కోట్ల అవినీతి జరుగుతోందని టీడీపీ సుమారు 7 సంవత్సరాల క్రితమే చెప్పిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. తన స్వగృహంలో వి లేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును మన స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నా రు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కమిటీ ఓబుళాపురం మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో పర్యటిం చి, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి జరుగుతున్న లక్షల కోట్ల ఆస్తినష్టం గురించి ప్రపంచానికి వెల్లడించిందని ఆమె గుర్తు చేశారు. ఆనాటి నుంచి అసెంబ్లీలోనూ, బయటా, పార్టీ అధినేత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ఈ అక్రమ మైనింగ్‌పై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తూనే ఉందని ఆమె తెలిపారు. అవినీతిమయ కాంగ్రెస్‌నూ, దాని నుంచే పుట్టిన పిల్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి, నీతి, నిజాయితీ గల తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.