March 28, 2013

ఎన్టీఆర్ యుగపురుషుడు

కాకినాడ సిటీ, : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 177వ రోజు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాయవరం, బిక్కవోలు మండలాల్లో సాగింది. బుధవారం 1.30 గంటలకు విద్యుత్ ఉద్యమంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం రాష్ట్రస్థాయి కాపు నాయకులతో సమావేశం నిర్వహించారు.

సాయంత్రం 4.15గంటల నుంచి పాదయాత్ర ప్రారంభించి రాయవరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి కొమరిపాలెం, తొస్సిపూడి మీదుగా బలభద్రపురం చేరుకున్నారు. అక్కడ కేపీఆర్ థర్మల్ ప్లాంట్ బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. రాత్రి బిక్కవోలులో బసచేశారు.