March 28, 2013

టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

వేటపాలెం: తెలుగుదేశం పార్టీ అధి కారంలోకి వస్తే వాన్‌పిక్ భూములు రైతులకు తిరిగి పంపిణీ చేస్తామని మాజీ ఎంపీ చిమటా సాంబు తెలి పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామ స్థాయిలో పరిస్థితులు తెలుసు కునేందుకు బుధవారం మండలంలో ని అక్కాయపాలెం, చల్లారెడ్డిపాలెం, పుల్లరిపాలెం పంచాయతీలలో సాంబు పర్యటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రామా ల అభివృద్ధి 20 ఏళ్లు వెనుకబడి పో యిందని తెలిపారు. అందువల్ల పం చాయతీ ఎన్నికలలో టీడీపీ మద్దతు దారులను గెలుపించుకోవాల్సిన అవ సరం ఎంతైనా ఉందన్నారు. చంద్ర బాబు పాలనతోనే రైతులు, చేనేతల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

తీవ్ర వర్షాభావ పరిస్థితు లలో సైతం, సాగునీరు, విద్యుత్ సక్ర మంగా సరఫరా చేసిన ఘనత చంద్ర బాబుకే దక్కిందన్నారు. అక్కాయపా లెం పంచాయతీలోని లక్ష్మీపురం గుర వయ్య కాలనీలో కొందరు చేనేతలు విద్యుత్ కష్టాలను ఏకరువు పెట్టారు. ఎన్నికల సమయంలో వర్క్ షెడ్డులు నిర్మించుకునేందుకు వీలుగా ఇస్తామ న్న ఇంటి స్థలాల సంగతి ఇంతవరకు పట్టించుకో లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చల్లారెడ్డిపాలెం, పుల్లరిపాలెం పంచాయతీలలో వాన్‌పిక్‌కు సంబం ధించి ఎటువంటి కారిడార్ నిర్మాణం జరగలేదు కాబట్టి తమ భూములకు సంబంధించిన పత్రాలు తమకు ఇస్తే బ్యాంక్ రుణాలు తెచ్చుకునేందుకు వీలుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ మం డల అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు, అక్కాయపాలెం గ్రామ అధ్యక్షుడు గొర్ల రాముడు, సూర్యచంద్ర, పింజల వీరవేణి, చల్లారెడ్డిపాలెం గ్రామ అధ్య క్షుడు గవిని వెంకటేశ్వర్లు, పుల్లరిపా లెం గ్రామ అధ్యక్షుడు తలారి రాజు, ప్రధాన కార్యదర్శి బచ్చుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.