March 28, 2013

నిరాహార దీక్షలకు తరలివెళ్లిన టీడీపీ నాయకులు


అబ్దుల్లాపూర్‌మెట్ : విద్యుత్ కోతలకు నిరసనగా న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు తెలిపేందుకు హయత్‌నగర్ మండలం నుంచి టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తరలివెళ్లారు. హయత్‌నగర్ మండల టీడీపీ అధ్యక్షుడు జక్కా రాంరెడ్డి ఆధ్వర్యంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు తొర్పునూరి జగన్‌గౌడ్, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ పురం యాదగిరిరెడ్డి, జోర్క జగన్ ముదిరాజ్, సిద్దంకి జగన్‌మోహన్‌రెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వెళ్లారు.