March 28, 2013

బాబ్లీపై అఖిలపక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పొన్నాల, శ్రీధర్‌బాబు, టీడీపీ నుంచి ఎర్రబెల్లి, మండవ, కడియం, విజయరమణారావు, టీఆర్ఎస్ నుంచి వినోద్, విద్యాసాగర్, వైసీపీ నుంచి కేకే మహేందర్‌రెడ్డి, సంకినేని, బీజేపీ నుంచి శేషగిరిరావు, ఎంఐఎం నుంచి జాఫ్రీ, సీపీఎం నుంచి జూలకంటి, మల్లారెడ్డి హజరయ్యారు.