March 28, 2013
మాకు 'కాపు' కాసింది వీళ్లే!
పేరుకే అగ్రకులం..పేదరికం వెక్కిరిస్తూ ఉంటుంది. బయటకు గంభీరంగా కనిపించినా
ఇంట గంజికి లేని కుటుంబాలు ఎన్నో. ఒకప్పుడు గొప్పగా బతికిన మనుషులే.
రాజకీయ ఆసక్తులతో ప్రత్యేకంగా కనిపించే వీళ్లు.. ఇప్పుడెక్కడ? రాయవరంలో ఆ
కాపు నాయకులు చెప్పిన విషయాలు విన్నప్పుడు ఇదే ప్రశ్న పదేపదే వెంటాడింది.
గోదావరి జిల్లాల్లో మాకు కాపు కాసిన కులమిది. బీసీ గుర్తింపు కోసం ఇక్కడ
హైదరాబాద్లో, అక్కడ ఢిల్లీలో తెలుగుదేశంతో కలిసి పోరాడారు. మధ్యలో కొన్ని
భ్రమలకు లోనయ్యారు.
కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని ఊదరగొట్టిన ఆ పెద్దమనిషి.. వీళ్లను రోడ్డుమీద వదిలేసి ఢిల్లీకి ఉడాయించాడు. వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాపులు సొంత ఇళ్లకు మళ్లుతున్నారు. రాయవరంలో కలిసిన కాపులు ఇదే ఆకాంక్ష వ్యక్తం చేశారు. పసుపు జెండాకు వారిచ్చిన సత్తువ ఎలా మరిచిపోగలం? అదే చెప్పాను. వారి కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భుజం తట్టాను. అక్కడ నుంచి కదులుతూ చూస్తే, వారి కళ్లలో చిన్నపాటి ఆశ కదలాడింది.
చిన్న చిన్న పల్లెల నుంచి ఒక మోస్తరు పట్టణాల దాకా కరెంటు కోసమే ఎదురుచూపులు! పంట పండాలన్నా, బతుకు నిండాలన్నా కరెంటు బుడ్డే ఆధారం.
తుసుకూడిలో పదిమందితో మాట్లాడితే ఎనిమిది మందిలో ఇదే ఆవేదన. లాకౌట్కు సిద్ధమవుతున్న మిల్లులను దారిలో చూశాను. బేరాల సమయంలో బయట దిగాలుగా కూర్చున్న వెల్డింగ్ షాపు ఓనర్లను చూస్తే బాధనిపించింది. చార్జీల నుంచి సర్చార్జీల దాకా.. పాపాలు పెరిగి పెరిగి ఏదో ఒక రోజున ఈ సర్కారుకీ షాక్ తగలకపోదు!
Posted by
arjun
at
2:59 AM