March 28, 2013

విద్యుత్ సమస్యపై వామపక్షాల రాష్ట్ర బంద్‌కు టీడీపీ మద్దతు

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కోతలు, సర్‌చార్జీల భారానికి నిరసనగా ఏప్రిల్ 9వ తేదీన వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.

విద్యుత్ సమస్యలపై టీడీపీ చేపట్టిన దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. కాగా టీడీపీ నేతల దీక్షలకు వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. ఏప్రిల్ 1న సీపీఐ, సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల, మండల స్థాయిలో నిరసన దీక్షలు చేపట్టనుంది.