March 28, 2013
విలువలను కాపాడే రాజకీయ పార్టీ టీడీపీ: చంద్రబాబు
కాకినాడ సిటీ: రాష్ట్ర
రాజకీయాలలో నూతన ఒరవడిని తీసుకు వచ్చిన ఎన్టీ రామారావు యుగపురుషుడు అని
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొనియాడారు. రాయవరంలో ఎన్టీఆర్
విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు ఇక్కడ మాట్లాడారు. ప్రజా సమస్యలు
తెలుసుకుని అధికారంలోకి వచ్చాకాపరిస్తానని చంద్రబాబు నాయుడు హామీఇచ్చారు.
వస్తున్నా మీకోసం 177వ రోజు పాదయాత్రకు రాయవరం మండలంలో అనూహ్య స్పందన వచ్చింది. బిక్కవోలు మండలం తొస్సిపూడిలో చంద్రబాబు మాట్లాడుతూ..వచ్చే ఎన్నికలలో ప్రలోభాలకు లొంగవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా పనికావాలని వెళ్తే గత ఎన్నికలలో డబ్బు తీసుకుని ఓట్లేశారని, పని ఎలా చేస్తానని మీ అనపర్తి ఎమ్మెల్యే చెప్తున్నాడట అని చంద్రబాబు ప్రజలను అడిగారు.
వచ్చే ఎన్నికలలో మాత్రం ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీ పాలన అందించే టీడీపీకి ఓటేయాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు.
Posted by
arjun
at
6:17 AM