March 28, 2013
రేపు టీడీపీ ఆవిర్భావ వేడుకలు
మంగళవారం ఆయన డిచ్పల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆవిర్భా వ వేడుకలను ప్రతీ యేటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వ స్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలంటే తెలిసే విధంగా చేసిన ఘనత ఎన్టీఆర్దేనని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పార్టీ ఆవిర్భావించిన ఆరు నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు ఒక్కరికే దక్కుతుందని, పే దల సంక్షేమం, బడుగు బలహీన వర్గా ల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర స్థాయి లో చెరగని ముద్ర వేశారన్నారు. దీనిలోభాగంగా రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళా సంఘాలకు రుణాలు, పేదలకు పక్కా గృహాలు ఎ న్టీఆర్ చేసిన ఘనతేనని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు నీరడి పద్మరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, నాయకులు శ్యాంరావు, ఎర్రన్న, నడిపన్న, తదితరులున్నారు.
Posted by
arjun
at
9:10 AM