March 15, 2013

వ్యాట్ ఎత్తివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం- ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి

తాండూరు :: తాండూరులో ఆరురోజులుగా వ్యాట్‌కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపా రులు నిర్వహిస్తున్న నిరవధిక బంద్‌కు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి గురువారం సంఘీబావం తెలిపారు. శాసనసభలో పార్టీపరంగా వ్యాట్ ఎత్తివేతకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కార్యక్రమంలో క్లాత్ మర్చంట్ అధ్యక్షుడు భగవాన్‌దాస్ గగరాణి, కార్యదర్శి బిచ్చాల అంబయ్య, సహకార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు ఎస్‌పి.రవి, కోశాధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.