March 15, 2013

తాగునీటి సమస్య పరిష్కరించాలి:టీడీపీ


చౌటుప్పల్ టౌన్: చౌటుప్పల్ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మాజీవైస్ ఎంపీపీ బొంగు జంగయ్యగౌడ్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణ టీడీపీ కమిటీ సమావేశం గురువారం జరిగింది.

సమావేశంలో జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇంటింటికి కృష్ణాజలాలను అందించేందుకుప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అరులైన పేదలకు రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, పింఛన్లు అందించాలని ఆయన కోరారు. పిలాయిపల్లి కాల్వ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని ఆయన కోరారు.

సహకార డైరెక్టర్‌గా ఎన్నికైన సుర్కంటి రాంరెడ్డిని సన్మానించారు. సమావేశంలో టీడీపీ ఏరియా ఇన్‌చార్జీ బొబ్బిళ్ల మురళీ, పట్టణ ప్రధానకార్యదర్శి బొమ్మిరెడ్డి మల్లా రెడ్డి,నాయకులు ఎండి బాబా షరీప్ ,ఊడుగు శ్రీనివాస్ గౌడ్ ,గోశిక నరసింహ ,టి.బాబు ,జి.శ్రీనివాస్ ,ఎం.రాజు, యాదయ్య ,శేఖర్ ,మలిగ శ్రీను ,నాగరాజు,రాములు,శ్యామ్ లు పాల్గొన్నారు.