March 15, 2013

పార్టీని గెలిపించుకుంటాం :కార్యకర్తలు

వచ్చే ఎన్నికల్లో పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఆచంట, కొవ్వూ రు నియోజకవర్గ కార్యకర్తలు చంద్రబాబుకు పూర్తి హామీ ఇచ్చారు. కొ వ్వూరు నియోజకవర్గంలో మీ పర్యట న కాస్త పొడిగించాల్సిన అవసరం ఉం దని ఆళ్ల హరిబాబు కోరారు. నియోజకవర్గాల్లో ఐదుగురితో పరిశీలనా కమి టీ వేసి ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను పరిశీలించాలని పోడూరు ప్రసాద్ సూచించారు. నాయకులంతా ఏకంగా ఉన్నారుగానీ కార్యకర్తలను ప ట్టించుకోవడం లేదని నున్న సాయి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు పింఛన్ల విషయంలో ఇంతకుముందు చాలా కష్టపడ్డాయని హనుమాయమ్మ చెప్పారు. రైతులకు రుణమాఫీ ఎంతో ప్రయోజకరమని వీరవెంకట్రావు వెల్లడించారు. ఆచంట నియోజకవర్గ కార్యకర్తలు కూడా తలోరీతిలో స్పందించారు. నూర్‌భాషీయులను కూడా పార్టీ ప్రోత్సహించాలని షేక్ షాజహాన్ కోరారు. ఏ విషయంలోనై నా జాప్యం చేయకుండా నిర్ణయాలను వేగంగా ప్రకటించాలని రాంబాబు త మ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. పా ర్టీ నుంచి ఫిరాయించి మళ్లీ తిరిగి వస్తే అటువంటి వారికి మళ్లీ అవకాశాలు ఇవ్వవద్దని మల్లిఖార్జునరెడ్డి పేర్కొన గా, అధికారాన్ని అనుభవించిన వారే పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి దిగుమతి అభ్యర్థులు అవసరం లేదని రా జేంద్రప్రసాద్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని తులసీరా వు పేర్కొన్నారు.