March 15, 2013

చంద్రబాబు హితోక్తులు...

చంద్రబాబు తన పాదయాత్రలో భాగంగా శుక్రవారం కార్యకర్తల సమావేశంలోను, బహిరంగసభల్లోనూ కొన్ని హితోక్తులు చేశారు. మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోయేవాళ్లం. అందుకే బేషజాలు వదిలి సమష్టిగా ఉండండి అని కార్యకర్తలకు హితవు పలికారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు అనునిత్యం విద్యార్థులే. అలా అయితేనే ఎదుగుతారు తప్ప లేదంటే ప్రజల ముందు కుప్పకూలిపోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎ ప్పుడైతే అహం వస్తుందో అప్పుడు పతనావస్థ ఖాయమన్నారు. డబ్బు కోసం కక్కుర్తిపడి ఎంతని సంపాదిస్తురో, ఏమి చేసుకుంటారో అంటూ ప్రశ్నించారు.

దుర్యోధనుడు ఒకనాడు విర్రవీగాడు. ఆ తర్వాత ఏమైందో మీకూ తెలుసు, రావణాసురిడిది ఇదే దారి అని చివరకు రాముడే గెలిచాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో పార్టీ ముఖ్యనేతలంతా జతకలిశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, వైటీ రాజా, అంగర రామ్మోహన్, మాగంటి బాబు, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరా జు, చింతమనేని ప్రభాకర్, టీవీ రామారావు, పీతల సుజాత, గంగిరెడ్ల మేఘలాదేవి, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, గుబ్బల తమ్మయ్య, చి నమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.