March 15, 2013

తొలి సంతకం రుణమాఫీ పైనే

ఇరగవరం/తణుకు : రాష్ట్రంలోని రై తులు, మహిళలు తీసుకున్న అన్ని ర కాల రుణాలను మాఫీ చేసి వారికి రు ణవిముక్తి కలగిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నా రు. జిల్లాలో చంద్రబాబు చేస్తున్న వ స్తున్నా మీ కోసం పాదయాత్ర శుక్రవా రం ఇరగవరంలో సాయంత్రం 4.10 లకు ప్రారంభమైంది. ప్రారంభం నుం చి మహిళలు పెద్ద ఎత్తున హారతులు, పూల మాలలతో బాబుకు స్వాగతం ప లికారు. ఇరగవరం మెయిన్ సెంటర్లో ప్రజల నుద్ధేశించి ఆయన మాట్లాడా రు.

మహిళలు, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖరరెడ్డి అనాలోచిత ని ర్ణయాలు వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన తెలిపారు. జన్మభూమి ద్వారా తెలుగుదేశం హయాంలో మూడు నెలలకొకసారి సమావేశాలు నిర్వహించి అధికారులు వచ్చి ప్రజా సమస్యలు ప రిష్కరించేవారన్నారు. సోనియా చో ద్యం చూడడం వల్లే రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అలా చేయని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నా రు. రుణ మాఫీపై తొలి,బెల్టుషాపుల ఎత్తివేతపై రెండో సంతకం చేస్తామన్నా రు.

వృద్ధులకు, వితంతువులకు 600 రూపాయలు పెన్షన్ అందిస్తామన్నా రు. అర్హులైన వారికి ఇంటి స్థలంతో పా టు లక్షా 50 వేల రూపాయలతో ఇంటి నిర్మాణం చేస్తామన్నారు. టీడీపీతోనే నీతివంత పాలన సాధ్యమన్నారు. మ ధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంద ని, గోదావరి జలాలు ఉన్నా తాగునీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉ ందన్నారు.ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీకి పట్టం కట్టాలన్నారు. పాద యాత్రలో మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, తోట సీతారామలక్ష్మి, మాగంటి బాబు, బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, పెనుమర్తి సోమ సూర్యచంద్రరావు, ఆరిమిల్లి రాము తదితరులు పాల్గొన్నారు.