March 15, 2013

ప్రజల నడ్డివిరుస్తున్న ప్రభుత్వాలు

షాద్‌నగర్ : అడ్డు అదుపు లేకుండా పన్నులను విధిస్తున్న ప్రభుత్వాలు ప్ర జల నడ్డి విరుస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు విమర్శలు గుప్పించారు. వ్యాట్‌కు నిరసన గా వస్త్ర వ్యాపారులు షాద్‌నగర్‌లో చే పట్టిన ఆందోళన కార్యక్రమానికి గురువారం బక్కని నర్సింహులు హాజరై మ ద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్స్‌టైల్ వ్యా పారంపై వ్యాట్‌ను విధించడమంటే ప రోక్షంగా ప్రజలపై భారం మోపడమేన ని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేం ద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూ ర్తిగా విస్మరించాయని ఆరోపించారు.

ఇ ప్పటికే వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను, విద్యుత్ ఛార్జీలను పెంచి ప్ర జలపై తీవ్ర భారం మోపాయని ఆ గ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మనిషి వి ధిగా కొనుగోలు చేయాల్సిన వస్త్రాలను కూడా వదలకుండా పన్నులు విధిస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు క్ష మించరని అన్నారు. వస్త్ర వ్యాపారులు చేపట్టే ఆందోళనకు తాము అండగా ని లుస్తామని బక్కని నర్సింహులు తెలిపారు. ఆందోళనకు టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్‌చార్జి వై.అంజయ్యయాదవ్ కూడా మద్దతు ప్రకటించారు. ప్రజల పై భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.

ఈ కా ర్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మంగూలాల్‌నాయక్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, వస్త్ర వ్యాపారులు గజవాడ నర్సింలు, నాగిళ్ళ ప్రభాకర్, ఎం.చంద్రమౌళి, దం డువాసు, రఘువీర్, పులిపాటి నర్సిం లు, రామ్మోహన్, న్యాయవాది కరీం, ఆర్యవైశ్య సంఘాల నాయకులు బె జుగం రమేష్, యంసాని శ్రీనివాస్, జి. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.