March 15, 2013
ఎన్నికలెప్పుడొచ్చినా అధికారం మాదే
కర్నూలు(కార్పొరేషన్): ఎన్నికలు ఎప్పుడు
జరిగినా అత్యధిక సీట్లు సా ధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో కి
వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సో మిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన
మాట్లాడుతూ ఈ ఏడా ది ఆఖరులోగా రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరిగే అవకాశాలు
మెండుగా ఉ న్నాయన్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కర్ణాటక
మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫండ్ కింద 500 కోట్లు
ఇచ్చినట్టు ఇటీవల గా లి అంగీకరించారని సోమిశెట్టి తెలిపా రు. తండ్రి
బాటలోనే వైఎస్ జగన్ అవినీతి అక్రమాలకు పాల్పడి లక్ష కోట్ల ప్రజా ధనం
దోచుకున్నారని విమర్శించారు. అలాంటి దొంగల పార్టీకి ఓటేస్తే రాష్ట్రం
దివాలా తీస్తుందని అన్నారు. విజయమ్మ జైలులో ఉన్న తన కొడుకును
విడిపించుకునేందుకు సోనియా గాంధీతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు.
16న మహా ధర్నా..
ప్రజా సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 16న కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపడుతున్నట్టు సోమిశెట్టి తెలిపారు. రైతు సమస్యలు, కరెంట్ కోతలు, సర్ చార్జీలు, నిత్యావసర ధరల పెరుగుల వ్యాపారులపై వ్యాట్ లాంటి అనేక సమస్యలపై మహా ధర్నా జరుగుతుందని అన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి సుబ్బరాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల పుల్లా రెడ్డి, ఆకెపోగు ప్రభాకర్ పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:56 AM