March 15, 2013

కార్యకర్తల ఆవేదన

రుణమాఫీ విషయంలో మీరు ఒక స్పష్టత ఇస్తే మరింతగా మనం ము ందుకు వెళ్దామని అని కార్యకర్త కేశవరావు అన్నారు. కరెంటు సమస్య తీవ్రంగా ఉందని కార్యకర్త శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదన పెడితే మీరు వారి వెంట వెళ్ళకుండా తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నామని మరో కార్యకర్త నాగేశ్వరరావు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో గందరగోళ పరిస్థ్ధితులను సరిదిద్దాలన్నారు. రైతు లు కష్టాలో ఉన్నారని, వీరికి పార్టీ అం డగా నిలుస్తుండడం సంతోషదాయకమని రాంబాబు అన్నారు.

నరసాపురంలో ఇన్‌ఛార్జి విషయంలో స్పష్టత ఇవ్వాలని భూపతి నరేష్ డిమాండ్ చేయగా మీరు చేస్తున్న పాదయాత్ర శ్రమ వృధా కానియ్యబోమని పార్టీ కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమేనని రాధాకృష్ణ అనే కార్యకర్త అన్నారు. మాల సామాజిక వర్గంలో ఉన్న అపోహలను తొలగించాలని రంజిత్ కు మార్ కోరారు. రుణమాఫీ జరిగితే ఏ ప్రాంతంలో ఎంతమంది రైతులకు మేలు జరుగుతుందో లెక్కలతో సహా మనం ప్ర చారం చేస్తే పార్టీకి తిరుగుండదని నరసింహారావు అనే కార్యకర్త అన్నారు. కొత్తపల్లి పేరు ప్రస్తావించకుండానే అతను పార్టీలో ఉన్నప్పుడు ఒక రీతిలో ఉన్నారని, ఇప్పుడు ఆయన స్వరూపం మారిందని నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు.