March 15, 2013

ప్రతి కార్యకర్తా అభ్యర్థే..!

ఏలూరు:'ప్రతి చోటా కార్యకర్తలు తమ ని యోజకవర్గాలకు అభ్యర్థి కావాలని అ డుగుతున్నారు. ఆరు నెలల్లో ఖచ్చితం గా ప్రకటిస్తాం. ప్రతీ కార్యకర్త నేనే అ భ్యర్థి అనుకుని పార్టీని గెలిపించండి. పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లకు ఎక్క డా చోటివ్వద్దు' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి నిజాయితీలతోనే తన పోరాటం కొనసాగుతుందన్నారు. ని యోజకవర్గాల వారీగా నాకూ అవగాహన ఉంది. సామాజిక న్యాయం అవసరం. అందుకనే బీసీలకు వంద సీట్లు ఇస్తామని ముందే చెప్పాం. ఇలాంటి వాటిని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..

వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా ఆయన 165వ రోజైన శుక్రవారం ఇరగవరం లో పాదయాత్ర ప్రారంభించే ముందు కొవ్వూరు, ఆచంట నియోజకవర్గ కా ర్యకర్తలతో ముఖాముఖి సంభాషించా రు. ఈ సందర్భంగా కార్యకర్తలు కొం దరు కొత్త సూచనలు చేశారు. రుణమాఫీ హామీ మన పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా కూడా కార్యకర్తలు చంద్రబాబు ఎదుట చెప్పుకొచ్చారు. వీలైనంత వరకు అభ్యర్థులను ముందే ప్రకటించినట్లయితే ఎన్నికల పోరాటంలో తాము అలుపెరుగకుండా పనిచేస్తామని కూడా ఆయనకు భరోసా ఇచ్చారు.పిల్ల కాంగ్రెస్ వారు ఎందరినో కొన్నారు. అయినా మన పా ర్టీ మాత్రం ఎక్కడా బలహీనం కాలే దు.

నిజమైన కార్యకర్తలతో, నిజాయితీ గా ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం. మీలో ఇంకా కసిపెరగాలని సూచించారు. మన దగ్గర బోలెడన్ని ఎన్నికల ఆయుధాలు ఉన్నాయి. వీటిని వినియోగించుకోండని పిలుపునిచ్చారు. మనకు అ భ్యర్థుల కంటే పార్టీయే ముఖ్యమన్నా రు. ఇప్పటికే కేసుల్లో ఇరుక్కుపోయిన పిల్ల కాంగ్రెస్ నేత చరిత్రలో రాజకీయాల జోలికి రానంతగా తెలుగుదే శం కుటుంబసభ్యులు నిత్యం కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశా రు. జగన్ బెయిల్ కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తు చేశారు.

'నే ను నిప్పులా ఉన్నాను.. నిజం నిప్పులాంటిది.. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే' అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విబేధాలకు తావివ్వకుండా సమష్టిగా పోరాడండి, పార్టీని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. ఆ చంట నియోజకవర్గంలోను, కొవ్వూరు నియోజకవర్గంలోనూ అప్పుడు, ఇ ప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది. ఇది కలిసొస్తే ఈ నియోజకవర్గాల్లో మనకు తిరుగుండదన్నారు.