March 15, 2013

కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే అవసరం లేదు : బొజ్జల

హైదరాబాద్ : వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని టీడీపీ నేత బొజ్జల ఆగ్రహం వ్యక్తపరిచారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెసతో పోరాడుతుంది టీడీపీయే అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యే అవసరం తమకు లేదన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడెలా స్పందిచాలో తమకు తెలుసని బొజ్జల పేర్కొన్నారు.