March 15, 2013

టీఆర్ఎస్ అవిశ్వాసంలో తెలంగాణ ప్రస్తావన లేదు : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్   : టీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాసంలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఇరుపులపాయ ఇచ్చిన ముడుపులకు ఆశపడి టీఆర్ఎస్ అవిశ్వాసం పెడుతోందన్నారు. తోక పార్టీలు రెండు ప్రత్యేక తీర్మానాలు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. తెలంగాణ తిరిగే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.