March 7, 2013

వీరభద్రారెడ్డి మృతి వెనక మర్మమేమిటి?


వైఎస్ కొడుకు దోచుకున్న చిట్టా వెలుగు చూడటంతో ఆయన జైలులో గడుపుతుండగా ప్రస్తుతం ఆయన అల్లుడు అనిల్‌కుమార్ అక్రమాల చిట్టా బయటకు వస్తోందని చంద్రబాబు చెప్పారు. అనిల్ బినామీల గుట్టు బయట పడకుండా ఆయన అనేక వక్రమార్గాలు వెతుకుతున్నారన్నారు. దీనికి ఇటీవల ఇదే జిల్లాలో చనిపోయిన వీరభద్రారెడ్డి వ్యవహారమే దర్పణమన్నారు. వీరభద్రారెడ్డిది హత్య, ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చగలిగితేనే అనిల్ అక్రమ కార్యకలాపాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ కుటుంబమంతా జైళ్ల పాలవుతోందని, ఆయన బావమరిది, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప దొంగ అని, ఇటీవల ఫోర్జరీ చేసి జైల్‌కు వెళ్లి వచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే టీడీపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు. "ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే మిమ్మల్ని భక్షిస్తోంది. కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. ప్రజల రక్తాన్ని పన్నుల రూపంలో జలగల్లా పీలుస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన సొమ్మును తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దిగమింగాయి. వైఎస్ హయాంలో జగన్ దోచుకున్న లక్ష కోట్లు పెట్టి మీ అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చు'' అని చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి 1.30 గంటల వరకు నడిచిన చంద్రబాబు కాళ్ల నొప్పులతో బాధపడ్డారు.