March 7, 2013
పార్టీ బలోపేతానికి కృషి చేయండి
మహబూబ్నగర్ జిల్లాలో
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆ
పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. కార్యకర్తలు
ప్రజల్లోకి వెళ్లిప్రజాసమస్యల సరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని
సూచించారు. నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన
రాజేశ్వర్గౌడ్ను మంగళవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పార్టీ బలోపేతం కావాలంటే యువతను ఆకర్షించాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రూప్ రాజకీయాలు వీడి తెలుగుదేశం పార్టీని 2014లో అధికారంలోకి తీసుకువచ్చేలా కలసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్గౌడ్,నాయకులు ఆంజనేయులు, జయశ్రీ, ఎన్పీ. వేంకటేష్, నాగేశ్వర్రెడ్డి,శంకర్, చంద్రశేఖర్రెడ్డి, జ్యోతి , వనజ, లక్ష్మీ, ఆనంద్గౌడ్, వెంకటేష్గౌడ్ తదితరు లు పాల్గొన్నారు.
Posted by
arjun
at
4:56 AM