March 7, 2013

స్థానిక ఎన్నకల్లో సత్తా చాటుతాం


బైరెడ్డిపల్లె : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేసి సత్తాచాటాలని మాజీ మంత్రి పట్నం సుబ్బ య్య పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లెలో రంగయ్య శెట్టి కల్యాణ మండపంలో మంగళవారం మాజీ ఎంపిీపీ, మం డల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయి ప్రజా సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో రైతులు తల్లడిల్లుతున్నా ప్రభుత్వం నిద్రావస్థలో వుందని విమర్శించారు. వచ్చే ఎ న్నికల్లో టీడీపీ ప్రభంజనంలో కాంగ్రె స్ గల్లంతుకావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపిీపీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పార్టీకి మూలస్తంభాలుగా వున్న కార్యకర్తలు ఇప్పటినుంచే సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. రేపటిరోజు వి.కోట మండలంలో జరిగే నారా లోకేష్ పర్యటనకు విజయవంతం చేయాలని కోరారు. కాగా ఈ సారి శాసన సభ ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యే టికెట్ పార్టీలో సీనియర్ నాయకుడైన శ్రీనివాసులు రెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత 25సం,గా వివిధ పదవుల్లో కొనసాగి జాతీయ అవార్డు పొందిన మాజీ ఎంపిపి శ్రీనివాసులు రెడ్డికి అధిష్టానం తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వెంకటప్ప గౌడు, అమరనాధరెడ్డి, నాగభూషణం, వెంకట్రమణగౌడు, ఓబుల్‌రెడ్డి, సుబ్రమణ్యం శెట్టి, క్రిష్ణారెడ్డి, నాగరాజు, సుబ్రమణ్యంరెడ్డి, షౌకత్, తదితరులు పాల్గొన్నారు.