March 7, 2013

మీరు రెచ్చిపోండి...


పాదయాత్రలో ఉన్న తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని... ఎమ్మెల్యేలు మొహమాటం లేకుండా ప్రభుత్వ వైఫల్యాలపై రెచ్చిపోవాలని చంద్రబాబు సూచించారు. విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో బ్లాక్ పేపర్ పెట్టాలన్నారు. విద్యుత్, నిత్యావసరాలు, బాబ్లీ, రుణమాఫీలో అవినీతి, ఇతర ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కర్తవ్యబోధ చేశారు. బ్రదర్ అనిల్, కొండలరావుల బినామీ వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతిపై విచారణ కోసం పట్టుపడదామని ఎమ్మెల్యేలు తీర్మానించారు. చంద్రబాబు కూడా దీనిని బలపరిచారు.

బ్రదర్ అనిల్ తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు ఇవ్వకుండా కథలు చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. తెలంగాణపై శాసన సభలో చర్చకు వచ్చినప్పుడు ఇతర పార్టీల ట్రాప్‌లో పడవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్ఎస్ తెలంగాణవాదంతో... కాంగ్రెస్, వైసీపీ సమైక్యాంధ్ర వాదనతో టీడీపీని ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నిస్తాయని, దీనిని జాగ్రత్తగా ఎదుర్కోవాలని తెలిపారు. అసెంబ్లీలో జరిగే చర్చలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అనే విధంగా ఎమ్మెల్యేలు డామినేట్ చేయాలని చంద్రబాబు సూచించారు.