March 7, 2013
వైఎస్ అవినీతి సాక్షిగా కిరణ్ ప్రభుత్వం
ముదినేపల్లి: వైఎస్ పాలనలో జరిగిన
అవినీతికి సాక్ష్యంగా కిరణ్ ప్రభుత్వం నిలిచిందని శాసన మండలి టీడీపీ ఫ్లోర్
లీడర్ దాడి వీరభద్రరావు విమర్శించారు. చంద్రబాబు వస్తున్నా.. మీకోసం
పాదయాత్రలో భాగంగా దాకరం వద్ద గురువారం జరిగిన టీడీఎల్పీ సమావేశానికి
విచ్చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కిరణ్కుమార్రెడ్డి
ప్రభుత్వం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. ఏ కోణంలో చూసినా
కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణమే తప్పా ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని
అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని అడిగితే ఆకాశం వైపు
చూడటమే తప్ప ప్రజలకు జవాబుదారితనంగా ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని
అన్నారు. జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు సాక్ష్యాధారాలు
చూపించినప్పటికీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు
నిర్మాణానికి ఒప్పదం కుదుర్చుకున్న కంపెనీ దాఖలు చేసిన అనుభవ సర్టిఫికెట్లు
తప్పుడవని తేలినా సీఎం తనదైన శైలిలో అవినీతిని ప్రోత్సహిస్తూ టెండర్లను
ఆమోదించారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ
ఉన్నారు.
Posted by
arjun
at
10:53 PM