March 7, 2013

ఇంజనీరింగ్ కాలేజీల్లో అర్హత లేని సిబ్బంది: టీడీపీ

  ఇంజనీరింగ్ కళాశాలల్లో అర్హత లేని సిబ్బందిని నియమిస్తున్నారని, ఈ అంశంపై ఎఎఫ్ఆర్‌సీ దృష్టి సారించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ.. తనిఖీలు చేసే ఎఎఫ్ఆర్‌సీకి చూపించే సిబ్బందిని యాజమాన్యాలు కాలేజీల్లో తర్వాత కొనసాగించడం లేదని ఆరోపించారు.