March 7, 2013

వైసీపీ బలమెంతో ప్రకటించాలి


టీడీఎల్పీ సమావేశం అనంతరం మోత్కుపల్లి నరసింహులు, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, హేమలత విలేకరులతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ... అసలు తన బలం ఎంతో తేల్చి చెప్పాలన్నారు. ఎవరెన్ని మాట్లాడినా, తమ వ్యూహం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ కోర్టులో అవిశ్వాసం ప్రకటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోత్కుపల్లి అన్నారు.