March 7, 2013

రుణ మాఫీ'పై సీబీఐ విచారణ: టీడీపీ

రైతు రుణాల మాఫీలో చోటు చేసుకొన్న అవకతవకలపై సిీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. రైతు రుణాల మాఫీలోనూ కుంభకోణాలు చోటు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించింది. బుధవారం టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

అర్హులైన రైతులకు రుణ మాఫీ వర్తించలేదని, ఆ పేరుతో అనర్హులు లబ్ధి పొందారని తాము గతం నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తమ ఆరోపణలు నిజమేనని ఇప్పుడు కాగ్ నిర్ధారించిందని పేర్కొన్నారు. ఏ కుంభకోణం బయట పడినా అందులో నిజం లేదని కాంగ్రెస్ వెంటనే బుకాయింపులు మొదలు పెడుతోందని, తర్వా త దానిని ఇతరులపైకి తోసేయడానికి మార్గాలు వెతుకుతోందని బొజ్జల ఆరోపించారు.