March 7, 2013
రుణ మాఫీ'పై సీబీఐ విచారణ: టీడీపీ
రైతు రుణాల మాఫీలో చోటు చేసుకొన్న అవకతవకలపై సిీబీఐ
విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. రైతు రుణాల
మాఫీలోనూ కుంభకోణాలు చోటు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించింది. బుధవారం
టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల
గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
అర్హులైన రైతులకు రుణ మాఫీ వర్తించలేదని, ఆ పేరుతో అనర్హులు లబ్ధి పొందారని తాము గతం నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తమ ఆరోపణలు నిజమేనని ఇప్పుడు కాగ్ నిర్ధారించిందని పేర్కొన్నారు. ఏ కుంభకోణం బయట పడినా అందులో నిజం లేదని కాంగ్రెస్ వెంటనే బుకాయింపులు మొదలు పెడుతోందని, తర్వా త దానిని ఇతరులపైకి తోసేయడానికి మార్గాలు వెతుకుతోందని బొజ్జల ఆరోపించారు.
Posted by
arjun
at
1:51 AM