March 7, 2013
దాకరంలో నేతల సందడి
ముదినేపల్లి : టీడీపీ శాసనసభాపక్షం
సమావేశం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ఎంపీలు ఇతర నాయకులు రావడంతో పోలవరపు సుబ్రహ్మణ్యానికి చెందిన తోటలో సందడి
వాతావరం నెలకొంది. గురువారం ఉదయం నుంచి చంద్రబాబును కలిసేందుకు జిల్లా
నాయకులే కాక ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు, రైతు సమాఖ్య
ప్రతినిధులు క్యూ కట్టారు. వారితో చంద్రబాబు సమావేశమై పలు విషయాలపై
చర్చించారు. సాయంత్రం 4.30 గంటలకు చంద్రబాబు దాకరం నుంచి పాదయాత్రను
ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల పార్టీ కార్యకర్తలు,
నాయకులు, అభిమానులు వందల సంఖ్యలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మహిళలు నుదిట
తిలకం దిద్ది హారతులు ఇచ్చారు.
పొలాల్లో పని చేస్తున్న కూలీలు సైతం చంద్రబాబును చూసేందుకు ఎగబడ్డారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రులు మాగంటి బాబు, ఎర్నేని సీతాదేవి, ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చలమలశెట్టి రామానుజయ, కొనకళ్ళ బుల్లయ్య, రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షులు సి.ఎల్.వెంకట్రావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగురైతు జిల్లా కార్యదర్శి కామినేని శ్రీరామకృష్ణప్రసాద్ తదితరులు బాబును కలిశారు.
Posted by
arjun
at
11:03 PM