April 24, 2013

కార్యకర్తలే టీడీపీ బలం

విజయనగరం టౌన్: కార్యకర్తలే టీడీపీకి బలమని ఆ పార్టీ సీనియర్ నే త తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 27న విశాఖలో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు సన్నాహాలను ప రిశీలించేందుకు మంగళవారం ఆయన విజయనగరం వచ్చారు. ఈ సంద ర్భంగా విజయనగరం నియోజకవర్గ పార్టీ శ్రేణులను ఉద్ధేశించి మాట్లాడా రు. కార్యకర్తల బలం, ప్రజల ఆశీస్సులతోనే టీడీపీ 30 ఏళ్ల ప్రస్థానంలో 17 ఏళ్ల పాటు అధికారంలో ఉందన్నారు. ఎన్నో ప్రజోపయోగకరమైన పనులు చేసిన ఘనత టీడీపీకే దక్
కిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడంలో ముందున్నారన్నారు. 63 ఏళ్ల వయస్సులో చంద్రబాబు రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో 87 నియోజకవర్గాల పరిధిలో 2,700 కిలోమీటర్లు నడచి, ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఇంతవరకూ దేశంలోని ఏ రా జకీయ నాయకుడు చేయలేదని, చేయలేరన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయన్నా రు. ప్రజా సంక్షేమాన్ని ఈ రెండు ప్ర భుత్వాలు విస్మరించాయని ఆయన ధ్వజమెత్తారు. 2014లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ, ఈనెల 27న జరిగే చం ద్రబాబు సభను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే సభకు తాను కూడా కార్యకర్తల తో పాటు బయలుదేరుతానని ప్రకటించారు. దీనికి కార్యకర్తల నుంచి హర్షం వ్యక్తమైంది. సమావేశంలో టీడీపీ నా యకులు ప్రసాదుల రామకృష్ణ, సైలా డ త్రినాథ్, ఎస్ఎన్ ఎం రాజు, డాక్ట రు వీఎస్ ప్రసాద్, మద్ధాల ముత్యాలరావు, ఎస్‌కెఎం భాషా, టీడీపీకి చెం దిన మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.