April 24, 2013

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలు

దర్శి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని తెదేపా పొలిట్ బ్యూ రో సభ్యుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జీ శిద్దా రాఘవరావు విమర్శించారు. దర్శి పంచాయతీలోని సందువారిపాలెం, చింత లపాలెం వీధులలో మంగళవారం మా జీ ఎమ్మెల్యే నారపుశెట్టిపాపారావుతో కలిసి ఇంటింటికి టీడీపీ యాత్ర నిర్వహి ంచారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మా ట్లాడుతూ తెదేపా హయాంలో మూడేళ్లు కరువొచ్చినా ప్రకటించిన సమయం ప్రకా రం విద్యుత్ సరఫరా చేయగలిగా మన్నా రు. ప్రస్తుతం విద్యుత్ ఎప్పుడు వస్తుందో , ఎప్పడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలన్నీ నిర్వీర్యమై పోయాయన్నారు. ప్రజల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపో తుందన్నారు. మహిళలు తాగునీటి సమస్య గురించి వివరిస్తుంటే ఆయన ఉద్వేగభరితుడై నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు ట్యాంకర్లు ఏర్పాటు చేశామని అవసరనమైతే మరికొన్ని ట్యాంకర్లు సమ కూరుస్తామని హమీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికనిధులు సాధించి దర్శిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం మాత్రమే కృషి చేసిందన్నారు.

స్వర్గీయ ఎన్‌టిఆర్, టిడిపి అధినేత చంద్రబాబుల హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అ భివృద్ధి చెందితే ప్రస్తుతం అధోగతి పాలైం దన్నారు. సందువారిపాలెం వాసులు గతంలో ఏ ఎన్నికలు వచ్చినా టిడిపికి పూర్తి అండగా నిలిచేవారిని వచ్చే ఎన్నిక లలో తెదేపా అభ్యర్థుల గెలుపునకు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు.

జగదీష్ మాట్లాడుతూ తెలం గాణ వస్తే ఆంధ్ర ఎడారి అవుతుంద న్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయాల కోసం పార్టీలు మారుతూ ప్రజల గురిం చి పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమం లో తెదేపా మండల అధ్యక్షుడు బల్లగిరి శీనయ్య, మాజీ అధ్యక్షుడు పి. సంజీవ య్య, దర్శి సింగిల్ విండో అధ్యక్షుడు కె. చంద్రశేఖర్, దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరివాసు, నాయకులు సంగా తి రుపతిరావు, సందు వెలుగొండయ్య, శోభా రాణి, రాచపూడి మోషే, పఠాన్ సుభానీ, మారెళ్ళ వెంకటేశ్వర్లు, గుర్రం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.