April 24, 2013
దళితుల పాలిట నరకాసురుడు సీఎం: ముద్దుకృష్ణమ్మ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'అమ్మ హస్తం'
సీఎం కిరణ్ ప్రచార హస్తం మాత్రమేనని టీడీపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు
మంగళవారం నాడిక్కడ పార్టీ సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు,
ఎల్వీఎస్సార్కే ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. నిత్యావసరాల ధరల తగ్గింపుపై
దృష్టిపెట్టని సీఎం, 'అమ్మ హస్తం' గురించి ఆర్భాటంగా ప్రచారం
చేసుకుంటున్నారని ఆరోపించారు.
వాస్తవానికి ఇది భస్మాసుర హస్తం పథకమని వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం కోట్లు వెచ్చించే బదులు నిత్యావసరాల ధరలు తగ్గించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అమ్మహస్తం పథకం కోసం సంచుల కొనుగోలులో భారీ కుంభకోణం చోటు చేసుకుందన్నారు.
వాస్తవానికి ఇది భస్మాసుర హస్తం పథకమని వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం కోట్లు వెచ్చించే బదులు నిత్యావసరాల ధరలు తగ్గించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. అమ్మహస్తం పథకం కోసం సంచుల కొనుగోలులో భారీ కుంభకోణం చోటు చేసుకుందన్నారు.
Posted by
arjun
at
5:09 AM