April 24, 2013
జూరాలకు నీళ్లివ్వండి: చంద్రబాబు
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న 46వేల ఎకరాల్లో పంట
ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్ణాటక
ప్రభుత్వంతో మాట్లాడి నారాయణ్పూర్ డ్యాం నుంచి సాగునీరు విడుదలయ్యేలా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. జూరాల ఆయకట్టు
రైతుల సమస్యను పార్టీ ఎమ్మెల్యే కె దయాకర్రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి
తీసుకువెళ్లినా..ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు
టీడీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Posted by
arjun
at
11:49 PM