April 24, 2013
వైఎస్ అక్రమార్జనలో కేసీఆర్కు భాగం
కాంగ్రెస్తో టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు: మోత్కుపల్లి
జగన్ తప్పుకుంటారా?: కూనంనేని
నల్గొండ, ఖమ్మం
చీకటి ఒప్పందాల ద్వారా ఉద్యమాన్ని నడుపుతున్నాడని ఆరోపించారు. కాగా, బయ్యారం గనుల్లో బ్రదర్ అనిల్ బినామీ అని నిరూపిస్తే మీతోపాటు మీ అన్న జగన్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని, రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని చెప్పగలరా అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు షర్మిలను ప్రశ్నించారు. ఇందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఖమ్మం బస్టాండ్ ఎదుట సీపీఐ నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్షణ స్టీల్తో తమకు సంబంధం లేదని చెబుతున్న షర్మిల.. ఆ సంస్థ కార్యాలయం తమ కాంప్లెక్స్లో ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు.
: కాంగ్రెస్తో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, వైఎస్ అక్రమార్జనలో కేసీఆర్కు కూడా
భాగస్వామ్యం ఉందని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. బయ్యారం
గనులతో పాటు పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఏనాడూ మాట్లాడలేదని, డబ్బులు
ముట్టటంతో నోరు మెదపకుండా ఫామ్ హౌజ్లో పడుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నడూ
సోనియా, ప్రధాని ఎదుట తెలంగాణపై కేసీఆర్ నోరెత్తలేదన్నారు.చీకటి ఒప్పందాల ద్వారా ఉద్యమాన్ని నడుపుతున్నాడని ఆరోపించారు. కాగా, బయ్యారం గనుల్లో బ్రదర్ అనిల్ బినామీ అని నిరూపిస్తే మీతోపాటు మీ అన్న జగన్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని, రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని చెప్పగలరా అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు షర్మిలను ప్రశ్నించారు. ఇందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఖమ్మం బస్టాండ్ ఎదుట సీపీఐ నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్షణ స్టీల్తో తమకు సంబంధం లేదని చెబుతున్న షర్మిల.. ఆ సంస్థ కార్యాలయం తమ కాంప్లెక్స్లో ఎందుకు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
11:56 PM