April 4, 2013

మధిరలో టీడీపీ కాగడాల ప్రదర్శన

మధిర రూరల్ : విద్యుత్‌చార్జీలు తగ్గించాలని, కోతలను ఎత్తివేయాలని కోరుతూ బుధవారం రాత్రి మధిరలో టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుతమ్ముళ్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధిరలోని విజయవాడ రోడ్డులో పెట్రోలుబంకు వద్ద ప్రారంభమైన ఈ కాగడాల ప్రదర్శన అంబేద్కర్ సెంటర్, మెయిన్‌రోడ్డు, క్లబ్‌సెంటర్ మీదుగా వైరా రోడ్డు వరకు సాగింది.

టీడీపీ కార్యకర్తలు కాగడాలను, జెండాలను పట్టుకొని విద్యుత్‌చార్జీలను తగ్గించాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చీదిరాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి మాదల రామారావు, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి చేకూరి శేఖర్‌బాబు, సొసైటీ చైర్మన్లు బిక్కి కృష్ణప్రసాద్, మాదల శరత్, నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చుంచు విజయ్, అయితం వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగా, రత్నకుమారి, దొండపాటి కృష్ణమూర్తి, చావా శివాజీ, తుమ్మలపల్లి శ్రీను, మాదల రాంబాబు, కేఎన్ఆర్, వాసిరెడ్డి ఉపేంద్ర, గుర్రం రామారావు, గుర్రం శివ, బట్టా గోవిందరాజు, వూట్ల చిన్నకృష్ణమూర్తి, పూర్ణచందర్‌రావు, రవికాంత్, వేల్పుల కొండ, కర్నాటి రాములు, రాయుడు భద్రయ్య,చావా వేణు, నంబూరి శ్రీనివాసరావు, అయిలూరి సత్యనారాయణరెడ్డి, దామా శేషగిరిరావు, నంబూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.