April 4, 2013
టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి : వైసీపీ
పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా నిరసిస్తున్నాయన్నారు.
క్రోసూరులో బుధవారం నియోజకవర్గస్థాయిలో జరిగే నిరసన కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో మండల నాయకులు జి బాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జి శ్యాంసన్, మహిళా నాయకురాలు ఎన్ నాగమ్మ, ఎస్కె హసీన్, చిలకా కోటేశ్వరరావు, సీహెచ్ నరసింహారావు, పఠాన్ గాలిసా, ఎస్కె బాజి తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:37 AM