April 4, 2013

టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

అచ్చంపేట: విద్యుత్ సంక్షోభానికి నిరసనగా మండల తెలుగుదేశం నాయకులు మంగళవారం ఆంజనేయుడి విగ్రహం సెంటర్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటివరకు 1500కు పైగా సేకరించినట్టు వారు తెలిపారు. సేకరణలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నల్లమేకల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు పొన్నెకంటి వెంకటరామారావు, నందిగం ఆశీర్వాదం, సరిమెళ్ళ రామిరెడ్డి, సందెపోగు శ్రీనివాసరావు, కొనకంచి యజ్ఞప్రసాద్, నెల్లూరి శ్రీనివాసరావు, ఎడ్లపల్లి బుచ్చిబాబు, గోపిదేశి సాంబశివరావు తదితరులు ఉన్నారు.

విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలి : వైసీపీ

పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాక్షసపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా నిరసిస్తున్నాయన్నారు.

క్రోసూరులో బుధవారం నియోజకవర్గస్థాయిలో జరిగే నిరసన కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో మండల నాయకులు జి బాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జి శ్యాంసన్, మహిళా నాయకురాలు ఎన్ నాగమ్మ, ఎస్‌కె హసీన్, చిలకా కోటేశ్వరరావు, సీహెచ్ నరసింహారావు, పఠాన్ గాలిసా, ఎస్‌కె బాజి తదితరులు పాల్గొన్నారు.