శామీర్పేట= :విద్యుత్ కోతలకు
నిరసనగా రాత్రి శామీర్పేట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట టీడీపీ మండల
అధ్యక్షుడు హరిమోహన్రెడ్డి ఆధ్యర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున
కొవ్వొత్తులు, పార్టీ జం డాలు పట్టుకుని ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిధిగా టీడీపీ ఇన్చార్జీ నక్క ప్రభాకర్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై
మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతామని అధికారం చేపట్టిన కాంగ్రెస్
ప్రభుత్వం నేడు అనేక దుర్మార్గాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మండల
టీడీపీ ఆధ్యక్షుడు హరిమోహన్రెడ్డి, మండల మాజీ ఎంపీపీ యాదగిరి మాట్లాడుతూ
ఎడాపెడా విద్యుత్ కోతలను విధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాకి ప్రజలే
బుద్దిచెపుతారన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపి రాష్ట్ర నాయకుడు
డాక్టర్ రమేశ్, పార్టీ మండల రైతు అధ్యక్షుడు గన్రెడ్డి, మండల ప్రధాన
కార్యదర్శి గోల్డ్ శ్రీనివాస్, నాయకులు కిషోర్యాదవ్, విష్ణుగౌడ్, బత్తిని
సత్యనారాయణ, టి.ఆర్.రవీందర్గౌడ్, తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు
అజయ్లక్ష్మి పాల్గొన్నారు.