April 4, 2013

'చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలి'


కోటనందూరు: వస్తున్న మీ కోసం చంద్రబాబునాయుడు పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యనమల కృష్ణుడు అన్నారు. కోటనందూరులో మండల పార్టీ అధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుని నియోజక వర్గంలో పాదయాత్ర ఏడు రోజులు ఉంటుందన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తొమ్మిదో తేదిన తుని నియోజక వర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందని, అధిక సంఖ్యలో కార్యకర్తలు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు.

ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం కోటనందూరు మం డలంలోనే జరగడం మన అందరి అదృష్టమన్నారు. ఉగాది వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. తొమ్మిదో తేదీన కొలిమేరు గ్రామంలో రాత్రి బస చేస్తారన్నారు. పదో తేదీన కేవో అగ్రహారం మీదుగా కోటనందూరు వచ్చి కాకరాపల్లి శివారులో రాత్రి బస చేస్తారన్నారు. 11న విశాఖ జిల్లాకు పయనం అవుతారన్నారు. అనంతరం బస చేసే ప్రదేశాన్ని పరిశీలించారు.

ఈకార్యక్రమంలో గొర్లి అచ్చియ్యనాయుడు, పెంటకోట భాస్కర సత్య నారాయణ, బంటుపల్లి జమీలు, పోతల సూరిబాబు, యర్ర చినసత్య నారాయణ, మాతిరెడ్డి బాబులు, వాసం బెన్నేశ్వరరావు, కుసిరెడ్డి కొండబాబు, గాదె వెంకట్రావు, అంకంరెడ్డి సత్యమూర్తి, వాసిరెడ్డి గోవిందు తదితరులు పాల్గొన్నారు.