April 4, 2013
కిరణ్ పాలనలో రాష్ట్రం అధోగతి
ఐ.పోలవరం: రాష్ట్ర
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని
ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దాట్ల బుచ్చిబాబు ఆరోపించారు.
విద్యుత్ చార్జీలు పెంపుదలను నిరసిస్తూ టీడీపీ సంతకాల సేకరణ చేపట్టింది.
ఇందులో భాగంగా ఐ.పోలవరం మండలం మురమళ్లలో దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో
పార్టీ నాయకులు సంతకాలు సేకరణ చేపట్టారు. విద్యుత్ చార్జీలు ఇష్టారాజ్యంగా
పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండుటెండలో పాదయాత్ర చేపడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్పార్టీ పతనం ఖాయమని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, బొంతు శ్రీరాములు, పచ్చిమాల భగవాన్దాసు, ఏలూరి మూర్తి, దంతులూరి ప్రసాద్, జంపన రామభద్రం, జనిపెల్ల విప్లవకుమార్, రాయపురెడ్డి మాణిక్యం, చెయ్యేటి శ్రీను, గంజా సుధాకర్, కొప్పిశెట్టి సోములు, ఉందుర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
12:27 AM