April 15, 2013

ప్రజా సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకునేందుకే పాదయాత్ర:శిద్దా


దర్శి: ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఇంటింటికి పాదయాత్ర నిర్వహిస్తున్న ట్లు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జీ శిద్దా రా ఘవరావు పేర్కొన్నారు. ఆదివారం దర్శి పంచాయతీ పుచ్చలమిట్టలో ఆ యన పాదయాత్ర చేపట్టారు. ముందు గా టీడీపీ కార్యాలయం నుంచి కా లినడకన పుచ్చలమిట్టకు చేరుకున్నా రు. అక్కడ వందలాదిమంది కార్యక ర్తలు, నాయకులు ఘనస్వాగతం ప లికారు. శిద్ధా రాఘవరావు సమకూ ర్చిన మంచినీటి ట్యాంకర్ల ద్వారా మ ంచినీరు సరఫరాను ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా పుచ్చల మిట్టవాసులు పలు సమస్యలను శిద్దా దృష్టికి తెచ్చారు. గ్రామంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సిమెం టు రోడ్లను పూర్తిచేయాలని, సైడుకా లువలు నిర్మించాలని కోరారు. మ ంచినీటి కొళాయిలు లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు చెప్పారు.

అనంతరం శిద్దా మాట్లాడుతూ ప్రజల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా మని హమీ ఇచ్చారు. టీడీపీ అధికా రంలోకి రాగానే అన్నివీధుల్లో సిమెం టు రోడ్డు నిర్మాణాలు చేయిస్తామని చెప్పారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిద్దా పాదయాత్ర సందర్భంగా కార్య కర్తలు బాణాసంచా కాలుస్తూ బ్రహ్మ ర«థం పట్టారు.

ఈ కార్యక్రమంలో టీ డీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నారపుశెట్టి పాపారావు, రాష్ట్ర వాణిజ్యవిభాగం కార్యదర్శి సూరె సుబ్బారావు, మండ లాధ్యక్షుడు బల్లగిరి శీనయ్య, మాజీ అధ్యక్షులు బొట్ల కోటేశ్వరరావు, చిట్టె వెంకటేశ్వర్లు, దర్శి పట్టణాధ్యక్షు డు యదగిరి వాసు, కార్యదర్శి రా చపూడి మోషే, జిల్లా మహిళా నాయ కురాలు శోభారాణి, దర్శి సింగిల్‌వి ండో అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, గురు వయ్య, మారం శ్రీనివాసరెడ్డి, జి.బాల గురువయ్య, బీరం వెంకటేశ్వరరెడ్డి, గుర్రం బాలకృష్ణ, మునగా శ్రీనివాస రావు, కిష్టయ్య పాల్గొన్నారు.