April 15, 2013
గిరిజనులను మభ్యపెడుతున్న సీఎం
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రాంతానికో విధంగా ప్రకటనలు చేస్తూ గిరిజనులను మభ్యపెడుతున్న సీఎం కిరణ్కి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని చంద్రబాబునాయుడు అన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనులకు అనుకూలంగా, హైదరాబాద్లో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానూ మాట్లాడుతున్న కాంగ్రెస్ పాలకులకు వెనుకబడిన వర్గాల సంక్షేమంపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేర్కొన్నారని, అదే వాస్తవమైతే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న సీఎంకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గిరిజనుల పొట్టకొడుతూ, పర్యావరణ పరిరక్షణకు ఆటంకం కలిగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కొందరికి డబ్బు చెల్లించి బాక్సైట్ అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.
Posted by
arjun
at
1:47 AM