April 15, 2013
తెదేపా పల్లెబాట
ఒంగోలు కార్పొరేషన్: తెలుగు
దేశం పార్టీ పల్లెబాట పట్టనుంది. కాం గ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవి
నీతిపై విస్తృత ప్రచారం చేయనుంది. ఈమేరకు ఆదివారం ఒంగోలులో జరిగిన పార్టీ
జిల్లా కార్యవర్గ సమా వేశంలో నేతలు నిర్ణయించారు. ని యోజకవర్గాల వారీ
సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలతోపాటు, పార్టీ పరిస్థితిపై పూర్తి
స్థాయిలో అధ్య యనం చేసి అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని
తీర్మానించారు. అవసరమైతే పోరా టాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో
తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ పార్టీ పటిష్ఠతకు
అందరూ ఐకమ త్యంతో పని చేయాలని సూచించా రు.
చంద్రబాబును ముఖ్యమంత్రి చే యడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాల న్నారు. రాష్ట్రంలో తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు ప్రజాధనాన్ని దోచుకున్నా యన్నారు. ఇదే విషయాన్ని తెదేపా రెండేళ్లుగా చెప్తున్నా కాంగ్రెస్, వైసీపీ లు తమ అవినీతిని కపిపుచ్చుకు నేందుకు ప్రయత్నించాయన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఆరుగురు మంత్రు లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయ డంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం తెదేపాపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతు న్నదని, ఈ నేపథ్యంలో తెదేపా నా యకులు, కార్యకర్తలు అవినీతి నేతల భాగోతాన్ని ప్రజలకు వివరించాల న్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన సంద ర్భంగా ప్రజలకు ఒనగూరిన ప్రయో జనం ఏమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించినా ఏఏ పథకాలకు ఎంత నిధులు కేటాయిస్తున్న విషయంలో స్పష్టత లేదన్నారు.
విద్యుత్ సమస్యపై తెదేపా ప్రజల పక్షాన పోరాడుతున్నదన్నారు. అం దులో భాగంగా ఇప్పటికే నియోజక వర్గాల వారీగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా వ్యా ప్తంగా సేకరించిన సంతకాలను ఈ నెల 19వ తేదీకి ఒంగోలులోని పార్టీ కార్యాలయానికి పంపాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పల్లె పల్లెకు తిరిగి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి పోరాటాలు చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు దారుల విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
జిల్లాలో తెదేపాకి పూర్వ వైభవం రావాలంటే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాల్సిన ఆవ శ్యకతను పలువురు నేతలు వివరిం చారు. నియోజకవర్గాల వారీ పార్టీ పరిస్థితులను అధ్యయనం చేయాల్సి న అవసరం ఉందన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో పార్టీకి ప్ర యోజనం చేకూరదని, ప్రజా సమస్య లపై పోరాటాలు సాగించాలని కొం దరు సూచించారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, అయితే అనాది నుంచి నేటి వరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని విస్మరించి, మధ్యలో వచ్చి పదవులు అనుభవించి మధ్య లో పార్టీని వీడే వారికి ప్రాధాన్యం ఇచ్చినందువలనే సమస్యలు వస్తున్నా యన్నారు. ఈ విధానం మారాల న్నారు.
అందుకోసం ముందుగా ప న్నెండు నియోజకవర్గాల ఇన్చార్జిలు ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కోరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పల్లె పల్లె నుంచి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే దివి శివరాం, ఎంఎం.కొండయ్య, చిమటా సాంబు, యర్రాకుల శ్రీనివా సరావు, డి.బి.బి.వి.స్వామి, ఎర్రగొం డపాలెం కో ఆర్డినేటర్ సిహెచ్.ఆంజనే యులు, మహిళా ప్రతినిధులు ఆర్ల వెంకటరత్నం, టి.అనంతమ్మ,భవాని, తమ్మినేని మాధవి, కత్తి పద్మ, గంగవ రపు పద్మావతి, ఆరె రత్నకుమారి, గోనె మేరీ రత్నకుమారిలతోపాటు, పలువురు ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:34 AM