April 15, 2013

టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ


చక్రాయపేట : 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణా లు మాఫీ చేయడానికి చంద్రబాబునాయుడు తొలి సంతకం చేస్తారని ఎమ్మె ల్సీ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సుర భి గ్రామం నాగులగుట్టపల్లెలో ఆదివారం ఆయన టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామం లో మెడికల్ స్టోర్ ఆంజనేయులు, రామక్రిష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెం దాలంటే చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి రావాలన్నారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూ న్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవినీతి పాలన అందించారని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గందరగోళమైపోయిందన్నా రు. గతంలో రోశయ్య పాలన కూడా అదే తీరులో వెళ్లిందని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటున్నారన్నారు. అనంతరం సతీష్‌రెడ్డి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమం లో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు నాగిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షబ్బీర్, రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు చలపతియాదవ్, సుబ్బరామయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు పట్టెం అశోక్, చంద్ర ఓబుల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు యెద్దుల చంద్ర, మాజీ వాటర్‌షెడ్ ఛైర్మన్ రాజారెడ్డి, మెడికల్‌స్టోర్ ఆంజనేయులు, రామక్రిష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.