April 15, 2013
టీడీపీ భారీ ప్రణాళిక
తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'వస్తున్నా
మీ కోసం' పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న విశాఖలో నిర్వహించనున్న
బహిరంగ సభను భారీఎత్తున నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.
బహిరంగ సభ నిర్వహణ, జన సమీకరణ, పైలాన్ నిర్మాణ పనుల పర్యవేక్షణకు
సీనియర్లను రంగంలోనికి దింపింది. యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు,
వైఎస్ చౌదరి(సుజనా)లను నియమించింది. వీరిలో యనమల, గరికపాటి రెండురోజులుగా
విశాఖలోనే వుండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
ఆదివారం పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులతో సమావేశమయ్యారు. బహిరంగ సభ నిర్వహణ కోసం ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేశారు. 25వ తేదీ సాయంత్రానికి బహిరంగ వేదిక పూర్తికానున్నదని పార్టీ నేతలు చెబుతున్నారు. పైలాన్ కోసం అగనంపూడి టోల్గేటు సమీపంలో స్థలాన్ని నేతలు పరిశీలించారు. పైలాన్కు రెండు కిలోమీటర్ల దూరంలో చంద్రబాబు బస చేస్తారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, క్యాడర్ పనితీరు, నేతల మధ్య సంబంధాలపై సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం పాయకరావుపేట నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Posted by
arjun
at
6:30 AM